ముగించు

ఆసక్తి ఉన్న స్థలాలు

కుంటాల జలపాతం:

కుంటాల జలపాతం

కుంటాలజలపాతం నేరడిగొండ గ్రామము నుండి 12 కిలోమీటర్ల దూరంలో మరియు ఆదిలాబాద్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.కుంటాలా వద్ద, కడెం నది సెలయేళ్ళు 45  మీటర్ల లోతుతో ప్రవహించి, అరణ్యంలోకి కలుస్తాయి రాష్ట్రంలోనే ఇది అతి ఎత్తైన జలపాతం. ఈ అద్బుతమైన జలపాతం విస్తృతంగా ప్రవహించేటపుడు జలదారలు కన్నుల పండుగా చేస్తాయి.శీతాకాలంలో ఈ జలపాతంను చూసి ఆనందం పొందటానికి అనువైన సమయం.

సోమేశ్వర స్వామి అని పిలువబడే  శివలింగం ఈ జలపాతం దగ్గరలో ఉంది. మహా శివరాత్రి పర్వాదినాన ఇక్కడ అనేక మంది భక్తులు సందర్శించి శివా దర్శనం చేసుకుంటారు.

దిశా నిర్దేశాలు : ఆదిలాబాద్ నుండి 64 కిలోమీటర్లు. సమీప విమానాశ్రయం: హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (280 కి.మీ) సమీప రైల్వే స్టేషన్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (57 కిమీ). వసతి : అతిథి గృహాలు మరియు హోటళ్ళు ఆదిలాబాద్ మరియు నిర్మల్.

పొచ్చెర జలపాతం:

పోచ్చేర జలపాతం

పొచ్చెర జలపాతం ఆదిలాబాద్ నుండి 52 కిలోమీటర్ల దూరంలో ,నిర్మల్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో మరియు బోత్ బుజుర్గ్ నుండి 8 కి.మీ. దూరంలో ఉంది. గల గల పారే నీటి సవ్వడుల ధ్వనులు చెవుల కింపుగా వినిపిస్తూ ఒక అనిర్వచనీయమయిన కర్నాలకింపయిన అనుభూతిని కలిగిస్తుంది. రాతి వాలుల దిగువ చిన్న సెలయేళ్ళు 20 మీటర్ల లోతు వద్ద ఒక పెద్ద మనోరంజకమైన కొలనును ఏర్పరుస్తాయి. పొచ్చెర జలపాతాన్ని సందర్శించాడానికి శీతాకాలము అనువయినది.

దిశా నిర్దేశాలు : సమీపంలోని విమానాశ్రయం: హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (280 కి.మీ) సమీప రైల్వే స్టేషన్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (47 కిమీ).వసతి : ఆదిలాబాద్ మరియు నిర్మల్ లలో ప్రైవేట్ లగ్జరీ హోటల్స్ .

జైనత్ దేవాలయం :

జైనథ్ దేవాలయము

ఈ ఆలయం ఆదిలాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం పేరు మీద పెట్టబడింది. ఈ ఆలయము పల్లవ ముఖ్యులు ద్వారా నిర్మించబడిందని 20 శ్లోకములతో కూడిన ఆలయ శిలాశాసనం సూచిస్తుంది.ఈ ఆలయం జైన శైలి నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది. లక్ష్మీ నారాయణ స్వామి బ్రహ్మోత్సవం కార్తీక శుద్ద అష్టమి  నుండి బహుళ సప్తమి (అక్టోబర్ – నవంబర్) వరకు జరుగుతుంది. ఈ సమయములో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

దిశా నిర్దేశాలు : ఆదిలాబాద్ నుండి 20 కిలో మీటర్లు సమీప విమానాశ్రయం: హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (341 కిమీ) సమీప రైల్వే స్టేషన్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (20 కిమీ). వసతి: అతిథి గృహాలు మరియు ఆదిలాబాద్ లో హోటల్స్ .

నాగోబా జాతర కేస్లాపూర్ :

కేస్లాపూర్, నాగోబా దేవాలయము

ఆదిలాబాద్ నుండి కేస్లాపూర్ 35 కిలోమీటర్లు మరియు ఉట్నూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇచ్చట ప్రసిద్ద మైన నాగోబా ఆలయం ఉంది. ఇక్కడ  శేషనాగ్ (సర్ప అవతారం లో దేవుడి) దర్శనం ఇస్తాడు. ఈ ప్రవిత్ర దేవాలయం కు పెద్ద సంఖ్యలో భక్తులు  తరలి వస్తుంటారు. నాగోబా జాతర  పుష్య మాసములో (డిసెంబరు – జనవరి) మద్య కాలంలో జరుగుతుంది. ఈ ప్రఖ్యాతమైన జాతరలో వివిధ కులాలు మరియు మతాలకు చెందిన అనేక మంది భక్తులు  పాల్గొంటారు. ఈ జాతర లో  నాగ దేవతకి పూజలు జరుగుతాయి .  జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి మరియు పొరుగున ఉన్న మహారాష్ట్ర లోని గోండ్స్ , ఇతర తెగల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

దిశా నిర్దేశాలు : ఆదిలాబాద్ నుండి 32 కిలోమీటర్లు. సమీప విమానాశ్రయం: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (326 కిమీ). సమీప రైల్వే స్టేషన్: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ (32 కిమీ). వసతి : అతిథి గృహాలు మరియు ఆదిలాబాద్ వద్ద హోటల్స్ (32 కిమీ) .

గాయత్రీ జలపాతం :

గాయత్రీ జలపాతం

ఆదిలాబాద్ లోని ప్రసిద్ధ కుంటాల, పోచెరా జలపాతాలు గురించి మీరు విని ఉంటారు. కానీ అదే జిల్లాలో ఎక్కువగా ప్రాచుర్యము చెందని గాయత్రీ జలపాతము కూడా ఉంది.

ఎక్కువగా ప్రాచుర్యము చెందని గాయత్రీ జలపాతము కడెం నదిపై  ఉంది. ఈ నది గోదావరి కి ఉపనది. ఈ జలపాతము మానవ దృష్టికి అందనంత దూరములో దట్టమయిన అడవి లోపల ఏకాంత ప్రదేశములో తన నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆదిలాబాద్ జిల్లా- నేరడిగొండ మండలము- తర్నంఖుర్ద్ అనే గ్రామము నుండి సుమారు 5 కిలో మీటర్ల దూరములో ఈ జలపాతము కలదు. జలపాతానికి చుట్టుపక్కల నివసించే గ్రామస్తులు ఈ జలపాతాన్ని గదిద గుండం లేదా ముక్ది గుండం అని పిలుస్తుంటారు. 100 మీటర్ల ఎత్తునుండి లోయలోకి జాలువారే అద్భుత దృశ్యం వీనులకు విందు చేయక మానదు. ప్రకృతి మాత యొక్క ఇంతటి కళాత్మక సృష్టికి సాక్షులుగా మన మానవమాత్రులం ఆ ప్రకృతి  సౌందర్యానికి వీక్షించే ,  అలౌకిక భావానికి లోనయ్యే కృపా పాత్రులం అని అనుకోక తప్పదు.

ఆహ్వానించే జలపాతానికి ఎదురుగా నిలబడినప్పుడు, అందమయిన జాలు వారే స్వచ్చమయిన నీటిని ఆ మడుగు కింద చూడవచ్చు. పైనుండి లోయలోకి జాలు వారే నీటి చినుకులు చెక్కిలి పై పడే దృశ్యం అద్భుతముగా ఉంటుంది !!! అతిథులను ఆహ్వానించే ఆధునిక విధానము !!!  జలపాతము యొక్క ఉపరితల దృశ్యాన్ని చూడటానికి పైకి ఎక్కి నప్పుడు ఆ  ముగ్ద మనోహరమయిన దృశ్యానికి , ప్రకృతి అందాలకు బందీలమయిన భావన కలుగుతుంది .

దిశా నిర్దేశాలు : హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు 257 కిలోమీటర్ల దూరంలో NH 7 ద్వారా ప్రయాణిస్తే మీరు నేరడిగొండ గ్రామానికి చేరుకోవచ్చును.నేరడిగొండ గ్రామానికి చేరుకున్న తరువాత, మీరు 6 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణం చేస్తూ కుప్టి గ్రామానికి చేరుకోవలసి ఉంటుంది, ఇక్కడ మీరు తర్నాం గ్రామానికి చేరుకోవడానికి సరైన మలుపు తీసుకోవటానికి సూచించే ఒక సైన్ బోర్డుని కనుగొంటారు.దుమ్ము రహదారిపై 2 కి.మీ.ల దూరం మరియు డ్రైవ్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. తర్నాం గ్రామంలో, జలపాతాలకు చేరుకోవడానికి 5 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. మీరు మార్గనిర్దేశం చేసేందుకు గ్రామస్థులతో కలిసి ఉండాలని నిర్ధారించుకోండి, లేదా మీరు దట్టమైన అడవిలో కోల్పోతారు .